Wednesday, October 9, 2013

Dasaraa navaraatrulu - First day - స్వర్ణ కవచ అలంకృత అమ్మవారు

 
 
 
ఒక సంవత్సరమునకు నవరాత్రులు రెండు సార్లు జరుపబడతాయి.
ఒకటి - దేవి నవరాత్రులు అనగా శారదా నవరాత్రులు (దసరా)
మరొకటి - వసంత నవరాత్రులు.
 
           శారదా నవరాత్రులు శ్రీ దేవి వైభవానికి ప్రతీక. తొమ్మిది రోజులు తొమ్మిది స్వరూపాలుగా అమ్మవారిని కొలుస్తాము. అమ్మవారి దయ కరుణ్యానికి సాటి, అంతము లేదు. అమ్మవారు కామధేనువు. భక్తితో కోరినంతనే సర్వమూ ప్రసాదించే కారుణ్య రూపం. దసరా నవరాత్రులలో అమ్మవారు 9 మనోహరమైన రూపాలతో దర్శనం ఇస్తుంది. ఈ జగమంతా నిండి ఉన్నది కేవలం ఒక్క పరబ్రహ్మ స్వరూపమే(శక్తి స్వరూపిని అయిన అమ్మవారు మాత్రమే అని భావం). అనగా ఉన్నది ఒక్క నిర్గుణ తత్వమే. అలా నిండి ఉన్న ఒక్క పరబ్రహ్మ తత్వమే మనకు ఇన్ని స్వరూపాలుగా (అనగా - శ్రీ అన్నపూర్ణ, శ్రీ బాలాత్రిపురసుందరి, శ్రీ లక్ష్మి, శ్రీ సరస్వతి, శ్రీ గాయత్రి, శ్రీ లలిత, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ మహిషాసురమర్దిని) భాషిస్తోంది.

జగన్మాత అయిన అమ్మవారు -

విద్యను ప్రసాదించునపుడు, శ్రీ సరస్వతి (శ్రీ శారద, శ్రీ వాగ్దేవి, శ్రీ మహా విద్య)గా అనుగ్రహిస్తుంది.
అదే శక్తిరూపిణి ఐశ్వర్యం కటాక్షించినప్పుడు శ్రీ మహా లక్ష్మిగ కొలువు తీరుతుంది.
మూడు లోకాలకు అన్నమును, ఉదకమును (నీరు) ఇచ్చునపుడు అన్నపూర్ణగా అవతరిస్తుంది.
శక్తిని అనుగ్రహించునపుడు - రాజరాజేశ్వరిగా దర్శనం ఇస్తుంది.
వేదాల ఙ్ఞానమును ప్రసాదించునపుడు గాయత్రి రూపధారి అయి కరుణిస్తుంది.
చివరకు మహిషాసురమర్దిని అవతారం తీసుకుంటుంది.

         ఎన్ని రూపాలు తీసుకున్నప్పటికి, అన్ని స్వరూపాలు అబేధములు. అంతయు ఆ శ్రీమాత వైభవస్వరూపాలే. పరబ్రహ్మానికి రూపము లేదు. తల్లి  ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది. ఈ సృస్టిలో ఆమె కానిది ఏమి లేదు. రూపాలు (దుర్గా, గాయత్రి, కామాక్షి, మొ.) వేరు అయినప్పతికి, సాక్షాత్తు ఈ మూడు లోకాలు ఆ పరదేవత స్వరూపంతో నిండి ఉన్నాయి.
 
       ఈ దసరా నవరాత్రుల ప్రతిరోజు, అమ్మవారు తొమ్మిది స్వరూపాలుగా అవతారం తీసుకుంటుంది. 9 రోజులు ప్రతి అలంకరణకు సహస్ర నామంతో కుంకుమతో పూజించిన, ఎన్ని స్వరూపలతో కొలిచినా, ప్రతి రూపానికి అష్టోత్తరం చేసినా అవి అంతా శక్తి స్వరూపిని అయిన ఆ ఆది పరాశక్తి జగన్మాతకే.  
 
మూడు మూర్తులకును, మూడు రూపములకు, మూడు కాలములకు, మూలమగుచు బేధమగుచు, తుదకి అబేధ్యమయ్యావు బ్రహ్మము నీవే పాల నయనా. 
 
భావం: సర్వ దేవతా స్వరూపిణి అయిన అమ్మ, శక్తి ఒక్కరు మాత్రమే అని తెలిసే వరకు, సరస్వతి, లక్ష్మి, గాయత్రి, మొదలగు అన్ని రూపాలు వేరు వేరుగా అనిపించినా, అఖండ తేజోమయ శక్తిరూపం ఒక్కటే అని అనుభూతికి వచ్చిన తర్వాత అమ్మలందరు ఆ దివ్య మాత స్వరూపమే అని తెలియవస్తుంది.  
 
         తత్వము అనేక విధాలుగా ఉన్నా, పరబ్రహ్మం ఒక్కటే. తల్లి ఏ పేరుతో పిలిచినా, ఏ నామంతో పూజించినా తన భక్తులను ఆశీర్వదిస్తుంది. మహాలక్ష్మిగా అవతరణ దర్శనమిచ్చి, అష్టోత్తరంతో "బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమహ" అని కొలిచినా అది పరదేవతే. లలితా స్వరూపంలో దర్శనం ఇచ్చి - లలితా సహస్ర నామంతో "సృష్టికర్తై బ్రహ్మ రూప గోత్రి గొవింద రూపిణి సంహారిణి రుద్ర రూప తిరోదానకరి ఈశ్వరి" అని స్తుతించినా అది ఆ శక్తి రూపిణికే చేరుతుంది.
దసరా నవరాత్రులలో మొదటగా అమ్మవారు "స్వర్ణ కవచ అలంకృత" దర్శనం ఇస్తుంది.  
 
మూల కథ: 
                   పూర్వము దుర్గముడు అనె రాక్షసుడు బ్రహ్మ చేత వరాలు పొందుటకు తపస్సు చేసెను. తపస్సుకి ప్రసన్నుడైన బ్రహ్మని దుర్గముడు రెండు వరాలు కోరుకున్నాడు. ఒకటి - నాలుగు వేదములు తనలోకి ప్రవేశించాలి(అనగా వేదములు తనకి వశము అయి తనలోకి ప్రవేశించాలి. ఇది జరిగితే సమస్త ప్రజలు వేదములు మరచిపోతారు.) అని, రెండు - తను ఏ దేవుడు (అనగా ఏ పురుషుడు) చేతిలో సంహరించబడకూడదు అని కోరుకున్నాడు. బ్రహ్మ వరములను ప్రసాదించెను. అలా వరం పొందటం వలన - వేదములు తనలోకి ప్రవేశించగా, ఋషులు, ప్రజలు, దేవతలు మంత్రములు, వేదఙ్ఞానం కొల్పోయెను. దీనివల్ల యఙ్ఞ యాగాదులు జరగవు. దేవతలకు హవిస్సు అందదు. పూజలు హవిస్సు లేని కారణంగా పంటలు పండవు, వర్షము కురవదు. నీరు పారదు. కారణం ఇవి చేయటానికి మంత్రములు, వేద ఙ్ఞానము దుర్గముడిలోకి ప్రవేశించటం. ఋషులు, ప్రజలు అన్నపానీయములు లేక అలమటిస్తుండగా, ఋషులు అందరూ అమ్మవారి వద్దకు వెల్లి తమ సమస్యను చెప్పి, తమకి తిరిగి వేద ఙ్ఞానం కృప చేసి, సృష్టి నడిపించమని కోరెను. అమ్మవారు లోకాలను పోషించే జగన్మాత కనుక, మూడు లోకాల ముగ్గురమ్మల జగజ్జనని కనుక ఋషుల బాధను విని, ముందుగా శాకంబరి అవతారంలో కూరలు, పండ్లు, అన్నం, ఉదకం వెంటనే సృష్టించెను. ఇది ఆ తల్లి కారుణ్యం. మనం కోరినంతనే మనల్ని రక్షించుటకు సదా ఉంటుంది. ఋషులు, సకల ప్రాణులు ఇవి తిని ఆనందించుచుండగా, ఇవి అంతా చూసిన దుర్గముడు ఆగ్రహంతో వీరిపైన బాణములు ప్రయోగించెను. కాని అమ్మ శక్తిరూపిణి. తన పిల్లల పోషణ భరాన్ని తను సదా చూస్తుంది. రక్షణ చక్రం వేసి సమస్త ప్రాణులను దుర్గముడి బాణాల నుండి కాపాడుతుంది. దీనితో ఆగ్రహించిన దుర్గముడు అమ్మవారితో యుద్ధానికి సిద్ధం అయ్యెను. అమ్మవారు 11 రోజులు దుర్గమునితో పోరాడి 11వ రోజున దుర్గముని సంహరించెను.
 
            దుర్గముడిని సంహరించటం చేత అమ్మవారు దుర్గగా పిలువబడుతుంది. ఇది దుర్గ తత్వ విశేషము. దుర్గముడి సంహారం అనంతరం దుర్గ అమ్మవారు కనక వర్షం కురిపించి, కనక దుర్గ గా భక్తులను అనుగ్రహించింది. విజయవాడ కనకదుర్గమ్మగా మనల్ని దీవిస్తోంది.

       అమ్మవారు ఆరోజున స్వర్ణ కవచం ధరించి పోరాడి గెలిచినందున నేడు, దసరా నవరాత్రులలో మొదటగా అమ్మవారిని స్వర్ణ కవచంతో అలంకరించి, ఆభరణములతో శోభాయమానంగా అలంకరణ చేసి, దుర్గా స్తుతితో నవరాత్రలను ప్రారంభించవలెను.
 
       దేవి నవరాత్రులందు అమ్మవారిని స్వర్ణ కవచదుర్గగా దర్శించి అసుర సంధ్య వేలలో అమ్మవారిని శతాక్షిగా, శాకంబరిగా, దుర్గగా కొలిచి ప్రార్థించాలి. అలా చేసినవారికి అమ్మవారు సంపూర్ణ కటాక్షం లభిస్తుంది.
 
 
ఆమ్మవారి అలంకార రూపాలు:
1. స్వర్ణ కవచ అలంకృత అమ్మవారు
2. శ్రీ
బాల త్రిపురసుందరి స్వరూపం
3. శ్రీ
అన్నపూర్ణ స్వరూపం
4. శ్రీ
గాయత్రి స్వరూపం
5. శ్రీ
లలితా స్వరూపం
6. శ్రీ
సరస్వతి స్వరూపం
7. శ్రీ
మహా లక్ష్మి స్వరూపం
8. శ్రీ
దుర్గ (మహిషాసుర మర్దిని) స్వరూపం
9. శ్రీ రాజరాజేశ్వరి స్వరూపం.

శివార్పణం!!

Monday, May 6, 2013

మహాశివరాత్రి - Mahaa Sivaraatri

వాగర్ధావివ సంపౄక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ 


వాక్కు అర్థము అన్నవి విడిగా ఉన్నా విడదీయలేనివి. అటువంటి ఆది దంపతులగు పార్వతీపరమేశ్వరులకు నా వందనం.   
                              లోకరక్షకుడు అయినటువంటి పరమేశ్వరుడు, సదాశివుడు - అనగా సర్వ మంగళానికి ప్రతీక. సమస్త లోకాలు ఓంకార నాదం నుండి పుట్టినటువంటివి. ఆది-అంతము, చతుర్వేదములు, వేదాల సారం మరియు ఉపనిషత్తులకి సర్వేశ్వరుడే మూలం. కారణం చేతనే శ్రీ రుద్రము విధముగా నీలకంఠుడిని కొలుస్తోంది.
 
నమః సోమాయ రుద్రాయ - నమస్తామ్రాయచ అరుణాయచ
నమః శంగాయచ పశుపతయే చ - నమః ఉగ్రాయ భీమాయ
నమొ అగ్రేవధాయ దురేవధాయ - నమో హంత్రే హనియసే
నమొ వృక్షేభ్యొ  హరికేషేభ్యొ - నమస్తారాయ నమః శాంభవే మయోభవే
నమః శంకరాయ మయస్కరాయ - నమః శివాయ శివతరాయ
నమస్తీర్థాయ కుల్యాయ  - నమః పర్యాయ వర్యాయ
నమః ప్రతరణాయ చోత్తరణాయచ - నమః అతర్యాయ లాద్యాయ
నమః శష్ప్యాయ ఫెన్యాయ - నమః సికత్యాయ ప్రవాహ్యాయ
 
అర్థం: సృస్టికి మూలం అయినటువంటి పరమేశ్వరునికి, ప్రణవ మంత్రం అయినటువంటి నీలకంఠునికి, కష్టం సుఖం అనే జీవితం ఇచ్చినటువంటి కరుణ మూర్తికి, చిత్తశుద్ధితో ప్రాణ కోటిని నడిపించే ఈశ్వరునికి శతకోటి నమస్కారాలు 
ఇటువంటి కరుణమూర్తి అయిన పరమేశ్వరునికి అత్యంత ముఖ్యమైన రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి జరపబడటానికి ముఖ్యంగా 3 కారణాలు కలవు.

1. ఫాల్గుణ మాసం కృష్ణపక్షం - చతుర్దశి లేదా త్రయోదశి వచ్చే రాత్రి పరమేశ్వరుని లింగోద్భవ కాలమును మహాశివరాత్రి గా చేసుకుంటాం. ఇది ముఖ్యమైన కారణం. శివుడు లింగాకారమున సృస్టిని ఉద్ధరిస్తూ సకల సంపదలు ప్రసాదిస్తాడు.

2. అమృతం కోసం సురులు, అసురులు సముద్రమును చిలుకగా వచ్చిన విషం లోకాన్ని బాధిస్తున్నపుడు, సకల దేవతలు ఆదిదంపతులకు ప్రార్ధించగా, శివుడు లోకరక్షణ కొరకు విషాన్ని తన కంఠంలో నింపుకుని నీలకంఠుడు - గరళకంఠుడు  అయ్యాడు. లోక రక్షణ చేసిన మహాదినాన శివరాత్రిగా కొన్ని ప్రదేశాలలో జరుపుకుంటారు.

3. పార్వతీకల్యాణం కూడ శివరాత్రి జరుపుకోవటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. శివమహాపురాణంలో ప్రస్తావన వస్తుంది. జగన్మాత, మహాశక్తి అయినటువంటి పార్వతి దేవి పరమేశ్వరుని వివాహం చేస్కోవటం ఇదే రోజున జరగటం వల్ల శివరాత్రి జరుపుకుంటామని ప్రస్తావన. దేవిభాగవతం మరియు మహాశివపురాణం విషయానికి ముఖ్యమైన ఆధారములు. జగన్మాత పార్వతి ఎన్నో అవతారాలు తీసుకుంది, ఎందరికో కుమార్తెగా వచ్చి వారిని అనుగ్రహించింది. దేవిభాగవతం, శివమహాపురాణం నందు ప్రస్తావించినట్టు - పార్వతి దేవి

దక్షుని అనుగ్రహించింది - దాక్షాయిని అయింది
హిమవంతుని అనుగ్రహించింది - హైమవతి అయింది
పర్వత రాజుని అనుగ్రహించింది - పార్వతి అయింది
జనక మహారాజును అనుగ్రహించింది - జానకి అయింది
ఆకాశరాజుని అనుగ్రహించింది - పద్మావతి అయింది
మనిధ్వజుని అనుగ్రహించింది - మీనాక్షి అయింది
భ్రుగువుని అనుగ్రహించింది - భార్గవి అయింది
కాత్యయనుడిని అనుగ్రహించింది - కాత్యాయిని అయింది
 

అట్టి మహాస్వరూపం జగన్మాత లోకాలకు కరుణమూర్తి అయినటువంటి పార్వతి ఎన్ని అవతారాలు ఎత్తినా, ఎన్ని స్వరూపాలలో దర్శనం ఇచ్చినా - చివరికి అన్ని జన్మలలో ఆమె పరమేశ్వరునికి ఇల్లాలు మరియు లోకాలని కరుణించే ప్రసన్నమూర్తి. ఇది సత్యం, వేదాలు మరియు సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చిన తీర్పు.
మనోహరమైన పార్వతి - శివ కల్యాణం లోకానికి రక్ష.
 పూజావిధానం:
                  శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన, పవిత్రమైన బిల్వ పత్రాలతో స్నానం చేసి దేవదేవునకు పుష్పములు, ఫలములు కృతజ్ఞతా భావంతో నివేదించాలి. పర్వదినాన - తేనె, ఆవు పాలు, పండ్లు, పుష్పాలు, ఇతర పూజ సామగ్రితో రుద్రాభిషేకం చేయటం శ్రేస్ఠం. శివరాత్రినాడు ఉపవాస దీక్షలొ ఉండి, రోజంతా భక్తితో శివనామ జపం చేసిన వారు శివుని కృపకు పాతృలు కాగలరు.

శివరాత్రి రాత్రంతా శివుని ప్రార్ధిస్తూ, కీర్తిస్తూ, స్తుతిస్తూ చేసే జాగరణ శ్రేష్ఠం, ఫలదాయకం. 
ఓం నమః శివాయ
 

Thursday, January 24, 2013

Sreeraama Navami - శ్రీరామ నవమి

శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
 
                 శ్రీ మహా విష్ణువు అవతారం అయినటువంటి శ్రీరామచంద్రుని జననమును మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాము. రామనామం రాముని కంటే శక్తివంతమైనది. రామనామం మనల్ని సకల సముద్రాలు దాటించగలదు. వాల్మీకి ప్రణితమైన "శ్రీమద్రామాయణం" కేవలం ఇతిహాసము అనియే కాక "ఆది కావ్యము" గా కీర్తికాంచినది. అట్టి సంస్కృతిలో పుట్టిన మనం ధన్యులం.
 
                  రావణనాసురుడు బ్రహ్మచే సకల వరాలు పొంది; దేవతలు, రాక్షసులు, గంధర్వుల చేత మరణం అనేది లేని వరాలు పొంది, సకల ఋషులను బాధపెట్టెను. వారు ఒక దినము శ్రీమన్నారాయణుని వద్దకు వెళ్ళి, తమ కష్టాలను విన్నవించెను. రావణాసురుడు మానవులు అంటే చులకన భావముచేత వారిచే మరణం లేకుండునట్లు కోరలేదు. కాబట్టి శ్రీమహావిష్ణువు లోకకళ్యాణం కొరకు మానవ అవతారమున శ్రీరామచంద్రునిలా జన్మించెను. అట్టి మహావీరుని జననం మనం శ్రీరామనవమిగా చేసుకుంటున్నాము. ఇది ప్రధానమైన కారణం.

 
                 దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేసిన సంవత్సరకాలం తరువాత, పన్నెండవ మాసం చైత్ర శుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రం నాల్గవ పాదంలో, కర్కాటక లగ్నమున శ్రీరాముడు జన్మించెను. ఆ సమయమున సూర్యుడు, అంగారకుడు, గురుడు, సుక్రుడు, శని అను అయిదు గ్రహములు ఉచ్చ స్థానములలో ఉండెను. అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన, తుల రాశులయందు ఉండిరి. లోకనాయకుడు శ్రీరాముడు జన్మించిన పవిత్ర సమయం.

 
                  సర్వ ధర్మస్వరూపుడు అయినటువంటి సకల గుణాభిరాముని జననం, లోక కల్యాణం అయినటువంటి సీతారామ కల్యాణం మరియు శ్రీరామ పట్టాభిషేకం (అనగా శ్రీరామచంద్రుడు, సీతాసమేతముగా అయోధ్యకు తిరిగి వచ్చిన పిదప జరిగిన పట్టాభిషేకం) కూడా పలు చోట్ల శ్రీరామనవమిగా చేస్తారు.


మా ఇంట పూజా విధానం:

సాధారణ పూజ చేసుకుని, కొవెలకి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీస్కోవటం. సుందరకాండ పారాయణ, రామాయణ గ్రంథ పఠనం, సీతారామ కళ్యాణం చూడటం ద్వారా మనం శ్రీసీతారాములకు చేరువ అవుతాం.
 

Thursday, December 22, 2011

నక్షత్రాలు మరియు రాశులు

తెలుగులో మొత్తం 27 నక్షత్రాలు. ప్రతి నక్సత్రం లో నలుగు పాదాలు. (1,2,3,4)
Eg: అశ్విని-1 - పుట్టిన time బట్టి.


  1. అశ్విని

  2. భరణి

  3. కృత్తిక

  4. రోహిణి

  5. మృగశిర

  6. ఆరుద్ర

  7. పునర్వసు

  8. పుష్యమి

  9. ఆశ్లేష

  10. మఖ

  11. పుబ్బ (పూర్వ ఫల్గుని)

  12. ఉత్తర (ఉత్తర ఫల్గుని)

  13. హస్త

  14. చిత్త

  15. స్వాతి

  16. విశాఖ

  17. అనురాధ

  18. జ్యేష్ట

  19. మూల

  20. పూర్వాషాడ

  21. ఉత్తరాషాడ

  22. శ్రవణం

  23. ధనిష్ట

  24. శతభిషం

  25. పూర్వాభాద్ర

  26. ఉత్తరాభాద్ర

  27. రేవతి
రాశులు మొత్తం 12. (zodiac signs) వీటినే ఇంగ్లీష్ లో moon sign అంటారు.


  1. మేషం

  2. వృషభం

  3. మిధునం

  4. కర్కాటకం

  5. సింహం

  6. కన్య

  7. తుల

  8. వృశ్చికం

  9. ధనుస్సు

  10. మకరం

  11. కుంభం

  12. మీనం

http://en.wikipedia.org/wiki/Hindu_calendar

Tithulu - Days in తెలుగు & పక్షం

Every month is divided into two halfs based on the full-moon day and no moon day. They are called పక్షం (Paksham).
  1. శుక్ల పక్షం: The first fortnight between New Moon Day and Full Moon Day is called Shukla Paksha.

  2. కృష్ణ పక్షం: the period of the brightening moon, and the second fortnight of the month is called Krishna Paksha, or the period of the fading Moon
The lunar days are called tithis and each month has 30 tithis.

Fifteen each in each of the పక్షం.

  1. పాడ్యమి
  2. విదియ
  3. తదియ
  4. చవితి
  5. పంచమి
  6. షష్టి
  7. సప్తమి
  8. అష్టమి
  9. నవమి
  10. దశమి
  11. ఏకాదశి
  12. ద్వాదశి
  13. త్రయోదశి
  14. చతుర్దశి
  15. పౌర్ణమి / అమావాస్య
For more info about paksham : http://en.wikipedia.org/wiki/Paksha